ఈ క్రాప్‌ నమోదు పరిశీలన

ABN , First Publish Date - 2022-08-18T04:52:53+05:30 IST

గోటూరులో జరుగుతున్న ఈక్రాప్‌ నమోదును జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వర్‌రావు బుధవారం పరిశీలించారు.

ఈ క్రాప్‌ నమోదు పరిశీలన
పంటను పరిశీలిస్తున్న అధికారులు

వల్లూరు, ఆగస్టు 17: గోటూరులో జరుగుతున్న ఈక్రాప్‌ నమోదును జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వర్‌రావు బుధవారం పరిశీలించారు. రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలను ఖచ్చితంగా ఈ క్రాప్‌ బుకింగ్‌  చేసుకోవాలని అప్పుడే ప్రభుత్వం నుంచి రాయితీ పథకాలకు అర్హులు అవుతారని తెలియజేశారు.  వ్యవసాయ సహాయకులు పొలం మీద సాగు చేసిన పంటలను జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సాయిజ్యోతి, వ్యవసాయ సహాయకురాలు ఇంద్రజ, రైతులు పాల్గొన్నారు. 

అనర్హులకు ఈ క్రాప్‌ చేస్తే చర్యలు

కడప(రూరల్‌), ఆగష్టు 17: అనర్హులకు ఎట్టి పరిస్ధితుల్లో ఈ క్రాఫ్‌ చేయవద్దని ఒకవేళ చేస్తే బాధ్యులపై శాఖపర చర్యలు తీసుకుంటామ ని తహసీల్దార్‌ వివరామిరెడ్డి, ఏఓ సురే్‌షకుమార్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కడప రెవెన్యూ కార్యాలయంలో పంట నమోదుపై ఏఈఓ, వీఆర్‌ఓల శిక్షణలో ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా సాగుచేసిన పంటను ఈ క్రాప్‌ నమోదు చేస్తేనే రైతు భరోసా, పంట పరిహారం, ఇన్సూరెన్స్‌, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి ప్రయోజనా లు వర్తిస్తాయన్నారు. పీఎం కిసాన్‌ లబ్ధిదారులు 31వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు, ఏఎ్‌సఒలు, గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T04:52:53+05:30 IST