ఈసారి హజ్ యాత్రకు వారికి మాత్రమే అనుమతి
ABN , First Publish Date - 2022-04-12T13:06:28+05:30 IST
ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి స్వల్ప మార్సులు జరిగాయని మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు.
65 ఏళ్లలోపు వారికే హజ్ యాత్రకు అనుమతి
22 వరకు దరఖాస్తు గడువు పెంపు: ఏకే ఖాన్
హైదరాబాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి స్వల్ప మార్సులు జరిగాయని మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. సౌదీ అరేబియా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మేరకు 65 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించడం లేదన్నారు. ఈ నెల 30 నాటికి 65 ఏళ్లలోపు వయసు ఉన్న వారినే అనుమతిస్తామని వెల్లడించారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ www. Hajcommittee.gov.inలో లేదా 040-23298793 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.