AP News: కరుణాకర్ మృతికి కారణమైన నిందితులను శిక్షించాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-08-21T00:02:50+05:30 IST
Amaravathi: తాను సాగుచేసిన చేపల చెరువుల్లో పంటను అమ్ముకోనివ్వకుండా వైసీపీ (YSRCP) నేతలు కేతిరెడ్డి జగదీష్రెడ్డి, సురేష్రెడ్డి వేధించడంతోనే కావలిలో కరుణాకర్
Amaravathi: చేపల చెరువులో దిగుబడిని అమ్ముకోనివ్వకుండా వైసీపీ (YSRCP) నేతలు కేతిరెడ్డి జగదీష్రెడ్డి, సురేష్రెడ్డి వేధించడంతోనే కావలిలో కరుణాకర్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (TDP President Chandra Babu Naidu) ఆరోపించారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్న జగదీష్రెడ్డి ఆగడాలకు సీఎం జగన్ ముందుగానే అడ్డుకట్టవేసుంటే.. కరుణాకర్ ప్రాణాలు పోయేవికాదన్నారు. భూదందాలు, సెటిల్మెంట్లను దాటిన వైసీపీ నేతల ధనదాహం..ఇప్పుడు వ్యక్తుల ప్రాణాలను కూడా మింగేస్తోందని విమర్శించారు. వైసీపీ రాక్షసులను కట్టడి చేయడంలో ఆపార్టీ ఉదాసీనంగానే వ్యవహరిస్తోందని, ఘటనకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.