ఆ విద్యార్థులు ‘బంగారం’

ABN , First Publish Date - 2021-01-24T05:54:55+05:30 IST

మండలంలోని పెదమేడపల్లి మో డల్‌ స్కూల్‌ విద్యార్థులు మరోసారి తమ పాఠశాల కీర్తిని రాష్ట్రస్థాయిలో రెపరెపలాడించారు. ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారం పతకాలు సాధించి తమ సత్తాచాటారు.

ఆ విద్యార్థులు ‘బంగారం’
విజేతలను అభినందిస్తున్న డీఈవో నాగమణి, తదితరులు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో  ఇద్దరికి పసిడి పతకాలు

మరోసారి పెదమేడపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

అభినందించిన డీఈవో నాగమణి

మెంటాడ : మండలంలోని పెదమేడపల్లి మో డల్‌ స్కూల్‌ విద్యార్థులు మరోసారి తమ పాఠశాల కీర్తిని రాష్ట్రస్థాయిలో రెపరెపలాడించారు. ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారం పతకాలు సాధించి తమ సత్తాచాటారు. గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన 34వ రాష్ట్ర జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఎం.వెంకటరమణ అండర్‌-18 విభాగంలో 1500 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించాడు. కె.కృష్ణవేణి 5000 మీటర్ల రేస్‌వాక్‌లో ప్రతిభ చూపి పసిడి పతకాన్ని సాధించింది. వీరిద్దరూ ఇండియా అథ్లెటిక్స్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్‌ నుంచి ఈ పతకాలు అందుకున్నారు. ఈ మేరకు శనివారం విజయ నగరంలో డీఈవో నాగమణిని వీరితోపాటు రామభ ద్రపురం కేజీబీవీ విద్యార్థిని మాణ్యశ్రీ (జావెలన్‌ త్రోలో కాంస్య పతకం), షాట్‌ఫుట్‌లో పాల్గొన్న పెద మేడపల్లి మోడల్‌స్కూల్‌ విద్యార్థిని కలిశారు. ఈ సందర్భంగా డీఈవో వారిని అభినందించి భవిష్యత్తు లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుమంత్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T05:54:55+05:30 IST