దళితులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ABN , First Publish Date - 2022-07-01T07:17:45+05:30 IST
దళితులపై దాడులు చేసిన వారిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు.
పెద్దవూర, జూన్ 30: దళితులపై దాడులు చేసిన వారిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈనెల 13న మండలంలోని తమ్మడపల్లి గ్రామానికి చెందిన కట్టా నరేష్ కుటుంబం అగ్రవర్ణాల చేతిలో దాడికి గురికాగా ఆయన జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబుతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ దళితుల ఇంట్లో అక్రమంగా చొరబడి అఘాయిత్యాలు, దాడులు చేయడం అమానుషమని అన్నారు. దాడులు చేసిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మన్నె శ్రీధర్రావు, యనమల సత్యం, జంగాల లక్ష్మీ, చింతమల్ల పాండురంగయ్య, లకమల లింగయ్య, కామల్ల లింగయ్య, కాశమల్ల నరేష్, చింతమల్ల వెంకన్న, కృష్ణప్రసాద్, బూరుగు వెంకన్న, పృధ్వీ, నాగటి సృజన్, కొల్లి రామలింగయ్య, సల్వాది గోవింద్, కూడలి రామస్వామి, పాల్గొన్నారు.