HYD : ఆటో డ్రైవర్‌కు 32 ఏళ్ల మహిళ పరిచయం.. కల్లు తాగి.. బిర్యానీ కావాలని కోరగా తెచ్చి.. ఘోరం..!

ABN , First Publish Date - 2021-10-17T12:53:49+05:30 IST

32 ఏళ్ల మహిళ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. కల్లు తాగే అలవాటున్న ఆమె..

HYD : ఆటో డ్రైవర్‌కు 32 ఏళ్ల మహిళ పరిచయం.. కల్లు తాగి.. బిర్యానీ కావాలని కోరగా తెచ్చి.. ఘోరం..!

  • గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ముగ్గురి అరెస్ట్‌


హైదరాబాద్‌ సిటీ/రాజేంద్రనగర్‌ : ఈ నెల 13న జరిగిన మహిళ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ కేసు వివరాలతో ప్రకటన విడుదల చేశారు. 32 ఏళ్ల మహిళ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. కల్లు తాగే అలవాటున్న ఆమె ఈ నెల 13న హైదర్‌గూడ కల్లు దుకాణానికి వచ్చింది. అక్కడ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఈగంటి నరేశ్‌(31)తో పరిచయం అయింది. ఆమె కల్లు ప్యాకెట్‌ తెచ్చివ్వమని కోరగా, నరేష్‌ తెచ్చి ఇచ్చాడు. అదే సమయంలో కూకట్‌పల్లి వివేక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ నర్సింగ్‌రావు యాదవ్‌(32), బాలానగర్‌ ఫతేనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ బాకాపూరం ప్రసాద్‌ అలియాస్‌ చిలుక(35) పరిచయమయ్యారు.


మహిళ బిర్యానీ కావాలని కోరగా, ముగ్గురు బిర్యానీ తీసుకువచ్చి.. ఆమెను ఆటోలో హిమాయత్‌సాగర్‌ వైపు తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, రోల్డ్‌గోల్డ్‌ చైన్‌, పర్సును లాక్కొని పారిపోయారు. ఆమె రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నాలుగు బృందాలుగా నిందితుల కోసం వేట సాగించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆటోను గుర్తించి, నిందితులు ఆగంటి నరేశ్‌, నర్సింగ్‌రావు యాదవ్‌, బాకాపూరం ప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు. నేరానికి ఉపయోగించిన ఆటో టీఎస్‌ 35 టీ 2402ను సీజ్‌ చేశారు. కేసును ఛేదించడంలో రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య, డీఐ పవన్‌కుమార్‌, డీఐ మైలార్‌దేవుపల్లి రాజేందర్‌గౌడ్‌, డీఎ్‌సఐ మైలార్‌దేవుపల్లి కుమార్‌గౌడ్‌లు చురుకుగా వ్యవహించారు. 

Updated Date - 2021-10-17T12:53:49+05:30 IST