మూడు రోజుల మార్కెట్ ర్యాలీ... రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగిన ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద
ABN , First Publish Date - 2022-05-31T01:21:27+05:30 IST
ఈ రోజు(సోమవారం) వరకు జరిగిన మూడు రోజుల మార్కెట్ ర్యాలీలో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
ముంబై : ఈ రోజు(సోమవారం) వరకు జరిగిన మూడు రోజుల మార్కెట్ ర్యాలీలో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇక... 30 షేర్ల BSE సెన్సెక్స్ 1,041.08 పాయింట్లు, లేదా... 1.90 శాతం పెరిగి, 55,925.74 వద్ద స్థిరపడింది. మూడు రోజుల్లో... బెచ్మార్క్ 2,176.48 పాయింట్లు, లేదా... 4 శాతం జూమ్ చేసింది. ఈక్విటీల పెరుగుదల కారణంగా, BSE-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రోజుల్లో రూ. 10,19,936.84 కోట్లు పెరిగి, రూ. 2,58,47,092.40 కోట్లకు చేరుకుంది. ‘సానుకూల గ్లోబల్ సూచనలు, రుతుపవనాల ముందస్తు ఆగమనం కారణంగా ద్రవ్యోల్బణం మందగించే అవకాశముందన్న అంచనాలతో భారతీయ మార్కెట్లు మంచి ర్యాలీని చూశాయి.
గత శుక్రవారం యూఎస్ మార్కెట్ ర్యాలీని అనుసరించి గ్లోబల్ ఫ్రంట్లో, యూరోపియన్, ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లో రిటైల్ రీసెర్చ్ కహెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. సెన్సెక్స్ షేర్లలో టైటాన్ అత్యధికంగా 4.94 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.69 శాతం, ఇన్ఫోసిస్ 4.57 శాతం, ఎల్ అండ్ టీ 3.77 శాతం, టెక్ మహీంద్రా 3.59 శాతం, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3.57 శాతం చొప్పున పెరిగాయి. టీసీఎస్ 3.47 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.44 శాతం చొప్పున పెరిగాయి. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.28 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 2.23 శాతం లాభపడ్డాయి. డొమెస్టిక్ మార్కెట్లో వాల్యుయేషన్ కంఫర్ట్, గ్లోబల్ కౌంటర్పార్ట్లలో పాజిటివ్ ట్రెండ్ మద్దతుతో సమీప టర్మ్ ట్రెండ్ రివర్సల్ కనిపిస్తుందని అంచనా. రానున్న ఫెడ్ పాలసీ మీటింగ్ టోన్ను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా ఉండే ద్రవ్యోల్బణం ఆందోళనలను తగ్గించడంతో US స్టాక్లు ఊపందుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.