యూపీలో కల్తీ మద్యం తాగి ముగ్గురి మృతి...44 మంది ఆసుపత్రి పాలు

ABN , First Publish Date - 2022-02-22T15:32:28+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘడ్ జిల్లా మాహుల్ నగర్ పంచాయతీలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మరణించగా, మరో 44 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు...

యూపీలో కల్తీ మద్యం తాగి ముగ్గురి మృతి...44 మంది ఆసుపత్రి పాలు

ఆజంఘడ్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘడ్ జిల్లా మాహుల్ నగర్ పంచాయతీలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మరణించగా, మరో 44 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.ఆసుపత్రిలో చేరిన వారిలో ఏడుగురికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని ఆజంఘడ్ జిల్లా మెజిస్ట్రేట్ అమృత్ త్రిపాఠి చెప్పారు.కల్తీ మద్యం విక్రయించిన ఇద్దరు వ్యక్తులను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేశామని జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. మద్యం షాపు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారని మెజిస్ట్రేట్ చెప్పారు.తరచూ కల్తీ మద్యం తాగిన వారు అస్వస్థతకు గురవడం ఇటీవల పలుసార్లు జరిగింది.


Updated Date - 2022-02-22T15:32:28+05:30 IST