Agra Lucknow ఎక్స్‌ప్రెస్ వేపై కారు టైర్లు పగిలి బోల్తా...ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-04-28T15:14:02+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు....

Agra Lucknow ఎక్స్‌ప్రెస్ వేపై కారు టైర్లు పగిలి బోల్తా...ముగ్గురి మృతి

ఉన్నావ్ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వేగంగా వెళుతున్న కారు టైర్లు పగిలి రోడ్డుపై బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.బోల్తాపడిన కారును రెండు వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి, ఓ మహిళ, ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాధితులందరినీ బంగార్మావు పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు.పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి వీడియో ఫుటేజ్ సేకరించారు.ఉత్తరప్రదేశ్‌లోని బంగార్‌మౌ కొత్వాలి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-04-28T15:14:02+05:30 IST