మూడు జిల్లాల్లోనే అధికంగా Covid కేసులు

ABN , First Publish Date - 2022-03-12T17:16:48+05:30 IST

రాష్ట్రంలోని బెంగళూరుతో పాటు మైసూరు, శివమొగ్గ జిల్లాల్లో మాత్రమే కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన 27 జిల్లాలో ప్రభావం దాదాపు తగ్గిపోయింది. శుక్రవారం రాష్ట్ర వ్యా ప్తంగా 181 మందికి

మూడు జిల్లాల్లోనే అధికంగా Covid  కేసులు

బెంగళూరు: రాష్ట్రంలోని బెంగళూరుతో పాటు మైసూరు, శివమొగ్గ జిల్లాల్లో మాత్రమే కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన 27 జిల్లాలో ప్రభావం దాదాపు తగ్గిపోయింది. శుక్రవారం రాష్ట్ర వ్యా ప్తంగా 181 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 122 మంది మైసూరు, శివమొగ్గ జిల్లాల్లో 11 మంది చొప్పున నమోదయ్యారు. 10 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 260 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందగా బెంగళూరులో ఇద్దరు, రాయచూరులో ఒకరు ఉన్నారు. 2, 764 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 2,228 మంది ఉన్నారు.

Updated Date - 2022-03-12T17:16:48+05:30 IST