Nobel Peace Prize: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారతీయ పాత్రికేయులు

ABN , First Publish Date - 2022-10-07T13:34:22+05:30 IST

నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు అమెరికాకు చెందిన టైమ్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది.

Nobel Peace Prize: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారతీయ పాత్రికేయులు

న్యూయార్క్‌, అక్టోబరు 6: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు అమెరికాకు చెందిన టైమ్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది. ఇందులో ఫ్యాక్ట్‌ చెకింగ్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌ న్యూస్‌ సహవ్యవస్థాపకులు ప్రతీక్‌ సిన్హా, మొహమ్మద్‌ జుబేర్‌తోపాటు రచయిత, సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్‌ ఉన్నారు. నార్వేకు చెందిన చట్టసభ సభ్యులు, ఓస్లోలోని పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (పీఆర్‌ఐ), బుకీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక అనధికార జాబితాను టైమ్‌ మ్యాగజీన్‌ ప్రచురించింది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలను, విద్వేష ప్రచారాన్ని నిరోధించి... నిజమైన సమాచారాన్ని అందించడానికి ప్రతీక్‌ సిన్హా, మొహమ్మద్‌ జుబేర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని టైమ్‌ మ్యాగజీన్‌ పేర్కొంది. 2017 నుంచి కారవాన్‌ ఆఫ్‌ లవ్‌ పేరుతో మత సహనం కోసం ప్రచారం చేస్తున్న హర్ష్‌ మందర్‌ కూడా రేసులో ఉన్నారని పేర్కొంది.

Updated Date - 2022-10-07T13:34:22+05:30 IST