ముగ్గురు భారతీయులకు జాక్‌పాట్.. లక్కీ డ్రాలో ఒక్కొక్కరు ఎంత గెలుచుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-03-21T18:13:15+05:30 IST

ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన ముగ్గురు భారతీయులను అదృష్టం వరించింది. లక్కీడ్రాలో ఒక్కొక్కరూ పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు. ఈ క్రమంలో వారి ఆనందానికి అవధుల్లేకుండా పో

ముగ్గురు భారతీయులకు జాక్‌పాట్.. లక్కీ డ్రాలో ఒక్కొక్కరు ఎంత గెలుచుకున్నారంటే..

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన ముగ్గురు భారతీయులను అదృష్టం వరించింది. లక్కీడ్రాలో ఒక్కొక్కరూ పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు. ఈ క్రమంలో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అజిత్ అశోక్, సోమిల్ పోవాల్, ప్రభాకరన్ అనే ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్ల క్రితమే ఉపాధి కోసం యూఏఈ వెళ్లారు. ఈ క్రమంలో జాబ్ చేసుకుంటూనే తమ అదృష్టాన్ని పరీక్షిచుకోవాలని భావించారు. ఎమిరేట్స్ రాఫెల్ డ్రాలో పాల్గొన్నారు. లాటరీ నిర్వాహకులు తాజాగా విజేతల పేర్లను ప్రకటించారు. లక్కీ డ్రాలో ఈ ముగ్గురు యువకులు జాక్‌పాట్ కొట్టారు. ఒక్కొక్కరు సుమారు రూ.16లక్షలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. మెడికల్ కోడర్‌గా పని చేస్తున్న 34ఏళ్ల అజిత్ అశోక్.. తాను గెలుచుకున్న డబ్బులతో అప్పులు తీరిపోతాయని ఆనందం వ్యక్తం చేశాడు. కంప్యూటర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రభాకరన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 




Updated Date - 2022-03-21T18:13:15+05:30 IST