మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు పిల్లల మృతి

ABN , First Publish Date - 2022-01-18T16:14:48+05:30 IST

మీజిల్స్ వ్యాక్సిన్ షాట్ వేయించుకున్న ముగ్గురు పిల్లలు మరణించిన ఘటన...

మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు పిల్లల మృతి

బెంగళూరు: మీజిల్స్ వ్యాక్సిన్ షాట్ వేయించుకున్న ముగ్గురు పిల్లలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి పట్టణంలో జరిగింది.బెళగావి జిల్లా రామదుర్గ్ తాలూకాలోని సలాహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు చిన్నారుల మృతికి సంబంధించిన కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను అందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. ముగ్గురు పసిపిల్లల మృతి ఘటనతో ఏఎన్ఎం, ఫార్మాసిస్టులను సస్పెండ్ చేశామని, ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి, రాష్ట్ర స్థాయి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారుల నుంచి నివేదిక కోరామని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి కె సుధాకర్ చెప్పారు.


 రామదుర్గ్ తాలూకా బోచబల్ గ్రామానికి చెందిన పవిత్ర హులగూర్ (13 నెలలు), మధు ఉమేష్ కరగుండి (14 నెలలు), మల్లాపూర్ గ్రామానికి చెందిన చేతన్ పూజారి (12 నెలలు)లు మృతుల్లో ఉన్నారు.రామదుర్గ్ తాలూకాలోని సలాహళ్లిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ నెలవారీ టీకాలు వేసే కార్యక్రమం జరిగింది. జనవరి 12వ తేదీన 21 మంది చిన్నారులకు ఎంఎంఆర్‌ వ్యాక్సిన్‌ వేయగా, కొద్ది గంటల్లోనే ముగ్గురు చిన్నారులు వాంతులు చేసుకుంటూ మరణించినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.


Updated Date - 2022-01-18T16:14:48+05:30 IST