రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ABN , First Publish Date - 2022-07-01T06:01:04+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
- బైక్ను ఢీకొన్న కారు
- సంఘటనా స్థలంలో ఇద్దరు.. చికిత్స పొందుతూ మరొకరి మృతి
- శోకసంద్రంగా వికారాబాద్ ఆస్పత్రి ఆవరణ
- నస్కల్లో నెలకొన్న విషాదం
వికారాబాద్, జూన్ 30: బైక్పై పనికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వికారాబాద్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన మోహన్(40), ఖాజా(42), బోయిని అంజయ్య(40)అనే వ్యక్తులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వికారాబాద్లో పని ఉండడంతో వారు ముగ్గురు నస్కల్ నుంచి ఉదయం ఒకే బైక్పై బయల్దేరారు. వికారాబాద్ మండలం గొట్టిముక్ల వద్ద వేగంగా వచ్చిన కారు వీరి బైక్ను ఢీకొట్టింది. బైక్ నుజ్జునుజ్జవగా ఖాజా, మోహన్ అ క్కడికక్కడే మృతిచెందారు. అంజయ్యను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్య లో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. వారి రోదనలతో సివి ల్ ఆసుపత్రి మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఆస్పత్రికి వద్దకు డీఎస్పీ సత్యనారాయణ చేరుకొని బాధితులను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజశేఖర్ తెలిపారు.
- మూడూ కుటుంబాల్లో నెలకొన్న విషాదం
పరిగి: కూలికి వెళ్తుండగా ఒకే గ్రామానికి ముగ్గురి కూ లీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మూడు కుటు ంబాల్లో విషాదం నెలకొంది. పరిగి మండలం నస్కల్కు చెందిన మోహన్, ఎండీ ఖాజా, బి.అంజయ్య పని నిమి త్తం ఒకే బైక్పై వికారాబాద్కు వెళ్తుండగా కారు ఢీకొని మృతిచెందారు. మోహన్కు భార్య ప్రభావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖాజాకు భార్య మెహమూదాబేగం, పిల్లలు, అంజయ్యకు భార్య శారద, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరని రోదిస్తున్నారు. ముగ్గురి అంత్యక్రియలు నస్కల్లో గురువారం సాయంత్రం ముగిశాయి.