ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన 20 మందిలో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-03-07T15:46:11+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం బైపాస్‌లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన 20 మందిలో ముగ్గురి మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం బైపాస్‌లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్‌ని లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌లో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని కండ్రిక గ్రామస్తులు వెల్లడించారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామ శివారు కండ్రికకు చెందిన వారు గమనార్హం. క్షతగాత్రులు 20 మంది 108 వాహనాలలో ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో... మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 


Updated Date - 2021-03-07T15:46:11+05:30 IST