Madhya Pradesh: బావిలో మునిగి ముగ్గురు బాలుర మృతి

ABN , First Publish Date - 2022-06-13T16:22:54+05:30 IST

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ బావిలో మునిగి ముగ్గురు మైనర్ బాలురు మరణించారు....

Madhya Pradesh: బావిలో మునిగి ముగ్గురు బాలుర మృతి

భోపాల్ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ బావిలో మునిగి ముగ్గురు మైనర్ బాలురు మరణించారు.సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూర్ఖా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైసెన్ జిల్లాలో 35 అడుగుల లోతున్న ఈత కొడుతూ ముగ్గురు బాలురు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలురు స్నానానికి బావిలోకి దిగారు.సాయంత్రం వరకు వారు తమ ఇళ్లకు చేరుకోకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వెతకగా, బావి దగ్గర వారి బూట్లు,బట్టలు కనిపించాయని సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విమలేష్ రాయ్ తెలిపారు.


దీంతో కుటుంబ సభ్యులు, ఇతర గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీశామని పోలీసులు తెలిపారు.ముగ్గురు పిల్లల మృతితో గూర్ఖా గ్రామంలో విషాదం అలముకుంది. 


Updated Date - 2022-06-13T16:22:54+05:30 IST