బీజేపీలో చేరిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2021-03-01T00:03:40+05:30 IST
పాండిచ్చేరికి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరారు. కేంద్ర హోం మంత్రి..
కరైకాల్: పాండిచ్చేరికి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారంనాడు ఎన్నికల ప్రచారం కోసం పాండిచ్చేరిలోని కరైకాల్ వచ్చారు. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జాన్ కుమార్, ఆయన కుమారుడు రిచర్డ్, డీఎంకే మాజీ ఎమ్మెల్యే వెంకటేషన్, పీఎంకే మాజ ఎమ్మెల్యే అరుల్ మురుగన్, పారిశ్రామికవేత్త దామోదరన్, న్యాయవాది రామలింగం, స్పీకర్ సోదరుడు రామలింగం, ఆయన కుమారుడు రమేష్, మరో ఇద్దరు బీజేపీలో చేరారు.
మాజీ మంత్రి ఎ.నమశ్శివాయ. తేపైనాథన్ ఇటీవల కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. దీంతో మరికొందరు కూడా ఈ ఇద్దరి బాట పట్టనున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి మల్లాది కృష్ణారావు, ఎమ్మెల్యేలు కె.లక్ష్మీనారాయణ, జాన్ కుమార్లు కాంగ్రెస్కు, వెంకటేశన్ డీఎంకేకు రాజీనామా చేశారు. అయితే వెంటనే వారు బీజేపీలో చేరకపోవడంతో ఎన్ఆర్ కాంగ్రెస్లో చేరవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు తెరదించుతూ లక్ష్మీనారాయణన్, మల్లాది కృష్ణారావు మినహా తక్కిన వారు బీజేపీలో చేరిపోయారు.