నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST
గ్రామ పొలిమేర పొలంలోని పంటను దౌర్జన్యంగా కోసుకుని కులంపేరుతో దూషించారని పారుమంచాల గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ గతంలో ఫిర్యాదు చేశారు.
జూపాడుబంగ్లా, నవంబరు 26: గ్రామ పొలిమేర పొలంలోని పంటను దౌర్జన్యంగా కోసుకుని కులంపేరుతో దూషించారని పారుమంచాల గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో ముగ్గురిపై కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. గురువారం ఆత్మకూరు డీఎస్పీ శృతి విచారణ చేపట్టారు. నిందితులైన పగిడ్యాల మండలానికి చెందిన శ్రీనివాసులు, పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన వేణుగోపాల్, చిన్నవెంకటస్వామిని తర్తూరు అంచెవద్ద అరరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.