మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ABN , First Publish Date - 2022-01-23T04:56:04+05:30 IST

మండలంలోని మందరం సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మూ డు ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీహరిరెడ్డి తెలిపారు.

మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌
సీజ్‌ చేసిన ట్రాక్టర్లతో ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీహరిరెడ్డి తదితరులు

రాజంపేట, జనవరి 22: మండలంలోని మందరం సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మూ డు ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీహరిరెడ్డి తెలిపారు. ఒక్కో ట్రా క్టర్‌లో నాలుగు చొప్పున 12 టన్నుల ఇసుకను తరలిస్తుండగా శనివారం తెల్లవారు జామున ట్రాక్టర్లను పట్టుకుని సీజ్‌ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబీ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ ఇస్మాయిల్‌, సిబ్బంది బాల చిందరయ్య, పృధ్వి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-23T04:56:04+05:30 IST