Jammu and Kashmirలో పేలుడు..ముగ్గురు సైనికులకు గాయాలు

ABN , First Publish Date - 2022-06-02T13:17:16+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని గురువారం జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు....

Jammu and Kashmirలో పేలుడు..ముగ్గురు సైనికులకు గాయాలు

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని గురువారం జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. అద్దెకు తీసుకున్న ప్రైవేట్ వాహనంలో సైనికులు ప్రయాణిస్తుండగా ఈ పేలుడు జరిగిందని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.ప్రైవేటు వాహనం బ్యాటరీలో పేలుడు పదార్థాలు ఉంచడంతో అది పేలిందని ఐజీ చెప్పారు.ఆర్మీ రహస్య కార్యకలాపాల కోసం కొన్ని సార్లు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తుందని, అయితే వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని ఐజీ పేర్కొన్నారు. సైనికులు వాడిన ప్రైవేటు వాహనంలో గ్రెనెడ్, పేలుడు పదార్థాల కారణంగా బ్యాటరీ పేలి, ముగ్గురు సైనికులు గాయపడ్డరని ఐజీ తెలిపారు. క్షతగాత్రులైన సైనికులను ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం వచ్చి పేలుడు ఘటనపై దర్యాప్తు సాగిస్తోంది. 


Updated Date - 2022-06-02T13:17:16+05:30 IST