బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్లు జైలుశిక్ష

ABN , First Publish Date - 2021-02-25T13:04:30+05:30 IST

ఏటీఎం డబ్బుల గోల్‌మాల్‌కు పాల్పడిన బ్యాంకు మేనేజర్‌కు మూడు

బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్లు జైలుశిక్ష

హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా : ఏటీఎం డబ్బుల గోల్‌మాల్‌కు పాల్పడిన బ్యాంకు మేనేజర్‌కు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్‌ ఆదనపు సెషన్స్‌ జడ్జి కవిత తీర్పునిచ్చారు. కెనరాబ్యాంకు దిల్‌సుఖ్‌నగర్‌ శాఖలో  2008లో జరిగిన ఏటీఎం డబ్బుల గోల్‌మాల్‌ కేసులో బ్యాంకు మేనేజర్‌ ఎ.భాస్కర్‌రావుతో పాటు, ఇద్దరు అధికారులపై సరూర్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ బ్యాంకు మేనేజర్‌ భాస్కర్‌రావుకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించగా. మరో ఇద్దరు నిర్ధోషులుగా బుధవారం జడ్జి తీర్పునిచ్చారు.

Updated Date - 2021-02-25T13:04:30+05:30 IST