త్రోవగుంటా.. బండి తోలేదెట్టా..!

ABN , First Publish Date - 2021-01-17T05:29:31+05:30 IST

ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంటలో మెయిన్‌రోడ్డు అధ్వానంగా మారింది. గుంతలమయమై రాక పోకలు సాగించడానికి వాహనదారులు అవస్థ లు పడుతున్నారు.

త్రోవగుంటా.. బండి తోలేదెట్టా..!
వడ్డెపాలెం వద్ద గుంతలమయమైన తారురోడ్డు

మెయిన్‌రోడ్డు గుంతలమయం

వాహనదారుల అవస్థలు

పట్టించుకోని అధికారులు


ఒంగోలు(రూరల్‌), జనవరి 16: ఒంగోలు నగర పరిధిలోని  త్రోవగుంటలో మెయిన్‌రోడ్డు అధ్వానంగా మారింది. గుంతలమయమై  రాక పోకలు సాగించడానికి వాహనదారులు అవస్థ లు పడుతున్నారు. ప్రధానంగా జాతీయరహ దారిలోని త్రోవగుంట ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి చీరాల వైపు వెళ్లే రోడ్డు నేలకుంట వరకు దు స్థితి చేరింది. కొన్ని చోట్ల భారీ గోతులు ఏర్ప డడంతో వాహనదారులు ఈ గుంతలలో పడి క్షతగాత్రులవుతున్నారు. ఈ మార్గంలో ఒంగో లు నుంచి చీరాల ఆర్టీసీ బస్సులు, ద్విచక్రవా హనాలు, లారీలు ఇతర వాహనాల రాకపోకల తో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.  ఆటోలు కూ డా తిరగలేని పరిస్థితి నెలకొంది. అసలే గ్రా మంలో మెయిన్‌రోడ్డులో మలుపులు.. పైగా గో తులతో అల్లాడుతున్నారు. అంతేగాకుండా ఇటీ వల ఆ గోతుల్లో మట్టితోలడంతో దుమ్ము రేగు తూ స్థానికులతో పాటు వాహనదారులు ఇబ్బ ందిపడుతున్నారు. వర్షం వస్తే రోడ్డు కాలువ ను తలపించేలా మారుతుంది. ఇప్పటికైనా ఉ న్నతాధికారులు శాశ్వత ప్రాతిపదికన రోడ్డును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-01-17T05:29:31+05:30 IST