మేనిఫెస్టోలో చెప్పింది దశల వారి మద్య నిషేధం.. కానీ ఆచరణలో..: తులసీరెడ్డి
ABN , First Publish Date - 2022-03-17T17:31:09+05:30 IST
జగన్ పాలనలో రాష్ట్రం మద్యాంద్ర ప్రదేశ్గా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి ఆరోపించారు.
అమరావతి: జగన్ పాలనలో రాష్ట్రం మద్యాంద్ర ప్రదేశ్గా, సారా ఆంధ్ర ప్రదేశ్గా, త్రాగుబోతుల రాష్ట్రంగా తయారయిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిందేమో దశల వారి మద్య నిషేధం... కానీ ఆచరణలో జరుగుతున్నదేమో దశల వారి మద్య నిషా అని అన్నారు.
మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని తులసీరెడ్డి అన్నారు. మూడేళ్లలో ఎక్సైజ్ ఆదాయం మూడు రెట్లు పెరిగిందన్నారు. మద్యం వైసీపీ నేతల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ధరల పెంపుతో మందుబాబులు సారాకు అలవాటయ్యారని, రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందన్నారు. దీని పర్యావసానమే జంగారెడ్డిగూడెం మరణాలని తులసీరెడ్డి వ్యాఖ్యానించారు.