ఆ ఏడు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు

ABN , First Publish Date - 2021-04-23T23:33:43+05:30 IST

పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపింది.

ఆ ఏడు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు

అమరావతి: ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు విపత్తుల శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండని సూచించింది. ఈ మేరకు విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటన విడుదల చేశారు.  


ప్రకాశం జిల్లా: చంద్రశేఖరపురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, కనిగిరి, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, మర్రిపూడి, పొదిలి, గిద్దలూరు, చీమకుర్తి. 

నెల్లూరు జిల్లా: నెల్లరు, సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూర్, దగదర్తి, అనుమసముద్రంపేట, కలిగిరి, సంగం, కొడవలూరు.

కర్నూలు జిల్లా: కర్నూలు, నందికోట్కూరు, కల్లూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడ్తూరు, ఓర్వకల్లు, గడివేముల, దేవనకొండ, సి.బేళగల్, కొత్తపల్లె, వెల్దుర్తి. 

చిత్తూరు జిల్లా: శాంతిపురం, రామకుప్పం, వెంకటగిరికోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాలెం, గంగవరం, సోమల.

విజయనగరం జిల్లా: మెరకముడిదం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, తేర్లాం, బాడంగి, దత్తిరాజేరు, నెల్లిమర్ల, బొందపల్లి, బొబ్బిలి.

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, గంగువారి సిగడాం , రాజాం, సంతకవిటి, రేగడిఆముదాలవలస, ఎచ్చెర్ల, రంగస్థలం, బూర్జ.

తూర్పుగోదావరి జిల్లా: చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి, వై.రామవరం 

Updated Date - 2021-04-23T23:33:43+05:30 IST