పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్న వారికే టికెట్లు ఇవ్వాలి: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-07-10T20:16:45+05:30 IST
Hyderabad: మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన టి.కాంగ్రెస్ నేతలు భేటీకి పార్టీ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్, బోసురాజు, పలువురు నేతలు
Hyderabad: మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన టి.కాంగ్రెస్ నేతలు భేటీకి పార్టీ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్, బోసురాజు, పలువురు నేతలు హాజరయ్యారు. ఇటీవల పార్టీలో ఎర్ర శేఖర్ చేరికపై కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో టి.కాంగ్రెస్ నేతల సమావేశంపై ఆసక్తి నెలకొంది. పార్టీలో చేరికలు, రాహుల్ సభ ఏర్పాటు అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.
పార్టీలో చురుగ్గానే ఉన్నా..అసంతృప్తిగా లేను
‘‘మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి టిక్కెట్లు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. పీఏసీకి రాలేనని నేను ముందే చెప్పా. 29 మందితో కమిటీ వేస్తే దానికి వెళ్లి..నేను ఏం మాట్లాడతా? పీఏసీ కమిటీ సభ్యులను నలుగురు, ఐదుగురికి కుదించాలి. డాక్టర్ రవి చేరిక చెల్లకపోతే బీల్యా నాయక్ చేరిక ఎలా చెల్లుతుంది? బీల్యా నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నష్టం చేశారు
పార్టీలో చురుగ్గానే ఉన్నా..అసంతృప్తిగా లేను’’ అని వెంకటరెడ్డి అన్నారు.