25న జూలై నెల ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
ABN , First Publish Date - 2022-04-22T01:05:31+05:30 IST
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై నెల టికెట్లను ఈ నెల 25వ తేదీన ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై నెల టికెట్లను ఈ నెల 25వ తేదీన ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్తో పాటు ‘గోవింద’ యాప్లో టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఈ మేరకు టీటీడీ ఐటీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.