టిడ్కో ఇళ్ల.. రంగు మారింది!
ABN , First Publish Date - 2022-06-23T07:44:21+05:30 IST
టిడ్కో ఇళ్ల.. రంగు మారింది!
టీడీపీ హయాంలో నిర్మాణం.. నేడు పంపిణీ
విజయనగరం కార్పొరేషన్లోని పేదల కోసం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లు పంపిణీకి సిద్ధమయ్యాయి. 800ల గ్రూపు హౌస్లను జీప్లస్3 పద్ధతిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. ప్రభుత్వం మారడంతో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు జాప్యం చేసింది. ప్రతిపక్షాల ఆందోళనలు.. పేదల నిరసనతో ఎట్టకేలకు పనులు పూర్తి చేసి, తమ పార్టీ జెండాను తలపించే రంగులు వేసింది.. టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, కొంతమంది పాత లబ్ధిదార్లను తొలగించి, సీఎం జగన్ ఫొటోలతో కొత్త పట్టాలు తయారు చేసింది. ఈ ఇళ్లను గురువారం లబ్ధిదారులకు అందజేయనున్నారు.
- విజయనగరం, ఆంధ్రజ్యోతి