పులి సంచారంపై వదంతులు నమ్మొద్దు
ABN , First Publish Date - 2020-12-03T04:26:17+05:30 IST
చింతలమానేపల్లి మండలంలో పెద్దపులి సంచరిస్తోందనే వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎఫ్ఆర్వో రాజేందర్ సూచించారు.
-ఎఫ్ఆర్వో రాజేందర్
చింతలమానేపల్లి, అక్టోబరు2: చింతలమానేపల్లి మండలంలో పెద్దపులి సంచరిస్తోందనే వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎఫ్ఆర్వో రాజేందర్ సూచించారు. బాలాజీ అనుకోడ గ్రామంలో ఆయన ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రజలు చేన్లల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, చప్పుళ్లు చేయాలని సూచనలు చేశారు. కర్జెల్లి నుంచి గూడెం వరకు విస్తారంగా అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా వెళ్లవద్దని ఆయన సూచించారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓలు మోహన్, శ్రీదేవి, అటవీ సిబ్బంది ఉన్నారు.