ఓజిలి మండలంలో పులి సంచారం

ABN , First Publish Date - 2022-05-25T05:57:04+05:30 IST

ఓజిలి మండలం భట్లకనుపూరు-పినపరియపాడు గ్రామాల సమీపంలో పులి సంచరిస్తుందన్న వదంతులపై ఈప్రాంతంలో కలకలం రేగింది.

ఓజిలి మండలంలో పులి సంచారం
భట్లకనుపూరు-పినపరియపాడు గ్రామాల సమీపంలో సంచరిస్తున్న పులి

ఓజిలి, మే 24 : ఓజిలి మండలం భట్లకనుపూరు-పినపరియపాడు గ్రామాల సమీపంలో పులి సంచరిస్తుందన్న వదంతులపై ఈప్రాంతంలో కలకలం రేగింది. ఓజిలి మండలం పినపరియపాడు నుంచి నాయుడుపేట మండలం పండ్లూరుకు వెళ్లే మార్గంలో మంగళవారం పశువుల కాపరులు పులి సంచరిస్తుండటాన్ని చూసి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి వాటిని వైరల్‌ చేశారు. ఈ ఘటనపై భట్లకనుపూరు గ్రామానికి చెందిన కొందరితో మాట్లాడగా పులి సంచరిస్తున్న విషయం వాస్తమేనంటూ తెలిపారు. గతంలో రాచపాళెంకు సమీపంలో రైల్వే ట్రాక్‌ వద్ద తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళిన ఓ వ్యక్తి పులిని చూసినట్లు, వారం కిందట ఆ ప్రాంతంలోనే చిల్లమానుచేనుకు చెందిన మరో వ్యక్తికి కూడా పులి కనిపించిందనే పుకార్లు అప్పట్లో వినిపించాయి. అయితే మంగళవారం పశువుల కాపర్లు ఏకంగా పులి సంచారం చేస్తున్న ఫొటోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఈ ఘటనలు పుకార్లు కావన్నది రుజువైంది. అటవీశాఖ అధికారులు పులి జాడలను కనిపెట్టి దానిని పట్టి ప్రజల భయాందోళనలు పోగట్టాల్సిన అవసరం ఉంది.


Updated Date - 2022-05-25T05:57:04+05:30 IST