కేంద్ర విధానంతో తీవ్ర ఆందోళనలో రైతులు: తికాయత్

ABN , First Publish Date - 2022-04-11T18:49:59+05:30 IST

టీఆర్ఎస్ ఢిల్లీలో చేపట్టిన రైతుల దీక్షకు భారతీయ కిసాన్ యూనియన్ నేత తికాయత్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు.

కేంద్ర విధానంతో తీవ్ర ఆందోళనలో రైతులు: తికాయత్

ఢిల్లీ: టీఆర్ఎస్ ఢిల్లీలో చేపట్టిన  రైతుల దీక్షకు భారతీయ కిసాన్ యూనియన్ నేత  తికాయత్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు.ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి.కేంద్ర విధానంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.సీఎం కేసీఆర్‌ రాజకీయ ఉద్యమం చేయడం లేదు.. రైతుల కోసం  ఆందోళన చేస్తున్నారు.విపక్ష సీఎంలు ఏకమై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి.రైతులు చేస్తున్నవి ఓట్ల దీక్షలు కావు’’ అని తికాయత్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-11T18:49:59+05:30 IST