ట్రోలింగ్ దెబ్బకు మాట మార్చిన ఆస్ట్రేలియా కెప్టెన్!
ABN , First Publish Date - 2021-05-15T16:35:11+05:30 IST
గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియా చీట్ చేసి గెలిచిందని వ్యాఖ్యానించిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ తాజాగా మాట మార్చాడు
గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియా చీట్ చేసి గెలిచిందని వ్యాఖ్యానించిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ తాజాగా మాట మార్చాడు. తన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నాడు. పైన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పైన్ తీరును విమర్శిస్తూ నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు. దీంతో పైన్ వెనక్కి తగ్గాడు.
`టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచిందనలేదు. సిరీస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్నకు మాత్రమే నేను సమాధానం చెప్పా. టీమిండియా బ్రిస్బేన్ వెళ్లదని మాకు వార్తలు వచ్చాయి. మమ్మల్ని పక్కదారి పట్టించేందుకే టీమిండియా అలా చెప్పిందేమో అనుకున్నా. ఇక, మూడో టెస్ట్లో టీమిండియా బ్యాట్స్మన్ ప్రతీసారి గ్లౌజ్లు తీస్తూ.. ఫిజియోను రప్పించి మాట్లాడేవారు. ఇదంతా మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకేమోనని అనుకున్నా. అందుకే సైడ్ షోస్ అనే పదం వాడాల్సి వచ్చింది. అంతే తప్ప టీమిండియా చీటింగ్ చేసి గెలిచిందని నేనెక్కడా అనలేదు. నా వ్యాఖ్యలను భారత అభిమానులు తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేశారు. నేను అలాంటివి పట్టించుకోను. ఎందుకంటే భారత అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం. వారు క్రికెట్కు ఇచ్చే గౌరవం ఏంటో నాకు తెలుస`ని పైన్ అన్నాడు.