రైల్వే స్టేషన్‌కు దగ్గరలో నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్.. అనుమానంతో ఓ వ్యక్తి వెళ్లి ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూస్తే..

ABN , First Publish Date - 2022-04-09T22:23:19+05:30 IST

రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఓ నిర్మానుష్య ప్రాంతం ఉంది. అక్కడ ఓ బ్యాగ్ ఓపెన్ చేసి ఉండటాన్ని అటువైపుగా వెళ్లిన ప్రజలు గుర్తించారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు బ్యాగ్ దగ్గరకు వెళ్లారు. అనం

రైల్వే స్టేషన్‌కు దగ్గరలో నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్.. అనుమానంతో ఓ వ్యక్తి వెళ్లి ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఓ నిర్మానుష్య ప్రాంతం ఉంది. అక్కడ ఓ బ్యాగ్ ఓపెన్ చేసి ఉండటాన్ని అటువైపుగా వెళ్లిన ప్రజలు గుర్తించారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు బ్యాగ్ దగ్గరకు వెళ్లారు. అనంతరం అందులో ఉన్న వాటిని చూసి షాకయ్యారు. వెంటనే వీడియో తీసి, పోలీసుకుల సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారులతోపాటు అనేక మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సఫేదాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతం ఉంది. అటువైపుగా వెళ్లిన కొందరు ప్రజలు ఆ ప్రదేశంలో ఓ బ్యాగ్‌ను గుర్తించారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. తీరా దగ్గరు వెళ్లి చూసి షాకయ్యారు. బ్యాగులో బాంబులు ఉండటంతో కంగుతిన్నారు. వెంటనే వాటి వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏటీఎస్ టీమ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను ఘటనా స్థలానికి రప్పించారు. అంతేకాకుండా బ్యాగులో ఉన్న ఐదు టైం బాంబులను నిర్వీర్యం చేయించారు. బాంబులతోపాటు ఒక డిజిటల్ టైమర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని ల్యాబ్‌కు పంపించారు. బ్యాగును అక్కడకు ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకునేందుకు అనుమానితులతోపాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా అక్కసారిగా అలజడి సృష్టించింది.




Updated Date - 2022-04-09T22:23:19+05:30 IST