పంటలకు సకాలంలో సాగునీరు
ABN , First Publish Date - 2022-08-11T04:30:08+05:30 IST
నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల రైతులకు వారు పండించే పంటలకు సకాలంలో సాగునీరు అందించేవిధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాయినిపల్లి, మోటుపల్లి, గవినివారిపాలెం, తోటవారిపాలెం ఎత్తిపోతల పథకాలను ఆయన బుధవారం మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామరావు, ఐడీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల రైతులను ఎత్తిపోతల పఽథకాల నిర్వహణ తీరుపై ఆరా తీశారు.
- ఎమ్మెల్యే కరణం బలరాం
చీరాల, ఆగస్టు 10 : నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల రైతులకు వారు పండించే పంటలకు సకాలంలో సాగునీరు అందించేవిధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాయినిపల్లి, మోటుపల్లి, గవినివారిపాలెం, తోటవారిపాలెం ఎత్తిపోతల పథకాలను ఆయన బుధవారం మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామరావు, ఐడీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల రైతులను ఎత్తిపోతల పఽథకాల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రైతులతో పాటు పశుపోషకులు, జీవాల కాపర్లకు సంబంధించి ప్రభుత్వ పరంగా అందిస్తున్న పఽథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.