టిప్పర్‌ ఢీకొని అక్కాతమ్ముళ్ల మృతి

ABN , First Publish Date - 2021-01-22T06:04:11+05:30 IST

రేణిగుంట సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా తమ్ముళ్లు గీతిక(22), గౌతమ్‌(16) మృతిచెందారు. అదే కుటుంబంలోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

టిప్పర్‌ ఢీకొని అక్కాతమ్ముళ్ల మృతి
మృతిచెందిన యువకుడు

 మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 

వీరంతా తమిళనాడువాసులు 


రేణిగుంట, జనవరి 21: రేణిగుంట సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా తమ్ముళ్లు గీతిక(22), గౌతమ్‌(16) మృతిచెందారు. అదే కుటుంబంలోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాజులమండ్యం ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కంచి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌, ఆయన భార్య గీతిక, బావమరిది గౌతమ్‌, రెండేళ్ల కుమారుడు జగదీష్‌ కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం గురువారం ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. గాజులమండ్యం ప్రైఓవర్‌బ్రిడ్జి సమీపంలో వీరి బైకును వెనుకనుంచి టిప్పర్‌ ఢీకొంది. దీంతో గౌతమ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీతిక కూడా తుదిశ్వాస విడిచారు. రెండేళ్ల చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బాలుడి తండ్రి శ్రీనివాసన్‌ కూడా చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించామని, సీఐ అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-01-22T06:04:11+05:30 IST