రేపు తిరుమలలో నూతన అతిధి గృహాలకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-09-23T14:44:01+05:30 IST
రూ.200 కోట్లతో తిరుమలలో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు శంకుస్థాపన జరుగనుంది.
తిరుమల: రూ.200 కోట్లతో తిరుమలలో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు శంకుస్థాపన జరుగనుంది. ఈ మేరకు కర్ణాటక ఎండోమెంట్స్ కమిషనర్ రోహిణి సింధూరి ప్రకటన చేశారు. మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమి ఉందని తెలిపారు. ఈ స్థలంలో 200 కోట్లతో నిర్మించనున్న నూతన అతిధి గృహాలకు రేపు ఏపీ సీఎం జగన్తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శంకుస్థాపన చేయనున్నట్లు రోహిణి తెలియజేశారు.