తిరుమలలో ఆలయ నిబంధనలు తుంగలో తొక్కిన టీటీడీ

ABN , First Publish Date - 2022-04-15T15:46:59+05:30 IST

ఉన్నతాధికారుల సాక్షిగా మరోసారి ఆలయ నిబంధనలు టీటీడీ తుంగలో తొక్కింది.

తిరుమలలో ఆలయ నిబంధనలు తుంగలో తొక్కిన టీటీడీ

తిరుమల: ఉన్నతాధికారుల సాక్షిగా మరోసారి ఆలయ నిబంధనలు టీటీడీ తుంగలో తొక్కింది. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే బంధువులు కోసం నిబంధనలకు పాతర వేసిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీవారి అభిషేక సమయంలో  టీటీడీ ఉన్నతాధికారి బంధువులు బయోమెట్రిక్ నుంచి ఆలయ ప్రవేశం చేశారు. శ్రీవారి ఆలయ ఉద్యోగుల ప్రవేశ మార్గమైన బయోమెట్రిక్‌ను ఓ ఉన్నతాధికారి.. తమ బంధువులు కోసం ఇష్టానుసారం వాడేస్తున్నారు. టీటీడీ తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం జరిగే అభిషేక సేవకు సర్కార్ తరుపున ఈవో కానీ చైర్మన్ కానీ హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. నేటి అభిషేక సేవకు ఇద్దరు హాజరుకావడంతో... ఏళ్ల క్రితం ఒకటవ నెంబర్ వస్ర్తం టిక్కెట్టు కలిగిన భక్తుడికి ఇక్కట్లు తప్పలేదు. 


Updated Date - 2022-04-15T15:46:59+05:30 IST