Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఐదు టన్నుల పూలు

ABN , First Publish Date - 2022-09-30T15:40:48+05:30 IST

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సేలం నుంచి 5 టన్నుల పూలమాలలు పంపారు. బ్రహ్మోత్సవాల(Brahmotsavams)

Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఐదు టన్నుల పూలు

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 29: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సేలం నుంచి 5 టన్నుల పూలమాలలు పంపారు. బ్రహ్మోత్సవాల(Brahmotsavams) సందర్భంగా తిరుమలలోని అన్ని వీధులు పూలతో అలంకరిస్తుంటారు. ఈ ఉత్సవాల కోసం సేలం నుంచి ప్రతి ఏడాది పూలమాలలు పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో, శనివారం జరుగనున్న గరుడ సేవ కోసం చామంతి, సంపంగి, బంతి, తులసి సహా పలురకాల పూలతో మాలలు సేలం పాత బస్టాండ్‌ సమీపంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో గురువారం మాలలు కట్టారు. పూజల అనంతరం ప్రత్యేక వాహనంలో పూలమాలలు తిరుమలకు పంపినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-09-30T15:40:48+05:30 IST