వైభవంగా మొదలైన శ్రీవారి వసంతోత్సవాలు

ABN , First Publish Date - 2022-04-15T02:27:55+05:30 IST

తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి సాలకట్ల వసంత్సోవాలు వైభవంగా మొదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయానికే పరిమితమైన

వైభవంగా మొదలైన శ్రీవారి వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి సాలకట్ల వసంత్సోవాలు వైభవంగా మొదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయానికే పరిమితమైన ఈ ఉత్సవాలు ఈసారి భక్తుల నడుమ వసంతమండపంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తర్వాత ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవ సందర్భంగా వసంతమండపంలో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా, శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వర్ణరథోత్సవాన్ని మాడవీధుల్లో నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-04-15T02:27:55+05:30 IST