తిరుమల అగ్ని ప్రమాద ఘటన మానవ తప్పిదమే: పోలీసులు

ABN , First Publish Date - 2021-05-07T19:12:00+05:30 IST

తిరుమల: అగ్నిప్రమాదం ఘటన మానవ తప్పిదంగా పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా మల్లిరెడ్డి కదలికలను పోలీసులు గుర్తించారు.

తిరుమల అగ్ని ప్రమాద ఘటన మానవ తప్పిదమే: పోలీసులు

తిరుమల: అగ్నిప్రమాదం ఘటన మానవ తప్పిదంగా పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా మల్లిరెడ్డి కదలికలను పోలీసులు గుర్తించారు. ఆస్థాన మండపం దుకాణాల సముదాయంలో మల్లిరెడ్డి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన సమయంలో దుకాణాల వద్ద 12 మంది సిబ్బంది నిద్రిస్తున్నారు. హరి అనే యువకుడి అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్టు పోలీసులు గుర్తించారు. శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థాన మండపంలో గత మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 దుకాణాలు కాలిపోయాయి. ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

 




కాగా.. దీనిని తొలుత ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులకు విచారణలో షాకింగ్ విషయం తెలిసింది. సజీవ దహనమైన మల్లిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన పోలీసులకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి. మృతుడు మలిరెడ్డి తన సెల్‌ఫోను, పర్స్‌ మరో దుకాణంలో ఉంచాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడి భార్య శోభ సహాయంతో లాక్‌ తీసి సెల్‌ ఫోన్‌ను పరిశీలించారు. మంగళవారం వేకువజామున 5 గంటల సమయంలో మలిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు గుర్తించారు. కీలకంగా మారిన ఆ వీడియోలోని విషయం ఏమన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మరింది. మరోవైపు ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మలిరెడ్డి ఎలా చనిపోయాడు? అతని ద్వారానే అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. విచారణ పూర్తైతే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-05-07T19:12:00+05:30 IST