Tirumalaలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-05-29T12:52:01+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్మెంట్లు నిండి ఆస్థాన మండపం వరకు క్యూలైన్ పెరిగింది. సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 89,318 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.