తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-09-04T12:58:43+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 79,833 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,074 భక్తులు మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.