Srivari Brahmotsavams: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
ABN , First Publish Date - 2022-10-03T13:07:11+05:30 IST
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Srivari Brahmotsavams) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగుతున్నాయి. ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.