గణనీయంగా పెరుగుతున్న శ్రీవారి హుండీ ఆదాయం
ABN , First Publish Date - 2022-07-05T15:07:24+05:30 IST
శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కొద్ది మాసాలుగా శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు.
తిరుమల : శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కొద్ది మాసాలుగా శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. వరుసగా నాలుగో మాసంలో.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు మార్క్ను దాటేసింది. మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్లో రూ.127.5 కోట్లు… మేలో రూ.130.5 కోట్లు, జూన్లో రూ.123.76 కోట్లు కానుకలువచ్చాయి. నాలుగు మాసాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.500 కోట్లు దాటేసింది. వచ్చే ఏడాదికి టీటీడీకీ రూ.1500 కోట్లు హుండీ ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.