శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2022-04-18T01:05:51+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ ఎమ్మెల్సీ విఠల్ దండే, తెలంగాణ ఎమ్మెల్యే గాంధీ ఉన్నారు. అంతేకాకుండా శ్రీవారిని ఆదివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవాస్తి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.