Tirumala: తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

ABN , First Publish Date - 2022-07-21T02:02:45+05:30 IST

తిరుమల (Tirumala)లో బుధవారం పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని

Tirumala: తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

తిరుమల: తిరుమల (Tirumala)లో బుధవారం పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ (TTD) పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. తర్వాత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. 

Updated Date - 2022-07-21T02:02:45+05:30 IST