TTD: పూర్ణాహుతితో ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-08-11T02:46:54+05:30 IST
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి.ఉదయం
తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి.ఉదయం 7 నుంచి 9 గంటల వరకు యాగశాలలో రుత్వికులు హోమాలు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత శ్రీవారి ఉత్సవమూర్తులు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. జీయర్స్వాములు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.