Tirumala: టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్లు
ABN , First Publish Date - 2022-07-23T00:42:32+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 25 టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు (TVS Electric Scooters) కానుకగా అందాయి.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 25 టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు (TVS Electric Scooters) కానుకగా అందాయి. దాదాపు రూ.30 లక్షల విలువైన ఈ ద్విచక్రవాహనాలకు శుక్రవారం ఉదయం ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాల తాళాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy)కి అందజేశారు. తిరుమల పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించిన టీవీఎస్ సంస్థకు ఈవో ధన్యవాదాలు తెలిపారు.