తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-04-23T13:26:32+05:30 IST
తిరుమల: కరోనా ఎఫెక్ట్ తిరుమలపై కూడా పడింది. తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గిపోయింది.
తిరుమల: కరోనా ఎఫెక్ట్ తిరుమలపై కూడా పడింది. తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గిపోయింది. గురువారం తిరుమల శ్రీవారిని 16,412 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 98 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 7,974 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.