తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

ABN , First Publish Date - 2022-05-20T14:17:12+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,625 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,584 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.


Updated Date - 2022-05-20T14:17:12+05:30 IST