తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-05-23T14:22:00+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 89,665 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 35,794 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.